Rajarshi Shah: పేపర్ లీకేజీ అంటూ ఫేక్ న్యూస్

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
పేపర్ లీకేజీ అంటూ ఫేక్ న్యూస్
* కలెక్టర్, ఎస్పీ సీరియస్
* ఫేక్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ముగ్గురి పై కేసు నమోదు
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా జ‌రుగుతున్నాయ‌ని, ఎలాంటి మాస్ కాఫీ జ‌ర‌గ‌డం లేద‌ని, పేప‌ర్ లీకేజీ అంటూ వ‌స్త‌న్న న్యూస్ ఫేక్ న్యూస్ అని జిల్లా క‌లెక్ట‌ర్ రాజ‌ర్షి షా తెలిపారు. ఈనెల 19న ఊట్నూర్లో ఎస్ ఎస్ సీ ఉర్దూ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది దీని గురించి విచారణ చేప‌ట్టారు. మమ్మద్ ముబాషిర్ అను అతను గతంలో టీఎంఆర్ఎస్ ఉట్నూరులో పనిచేసేవారుఉ. అక్కడ నాన్ టీచింగ్ సిబ్బందితో సరిగ్గా పడకపోవడం వల్ల అతని తీరు వారితో సరిగా లేకపోవడం వల్ల అతన్ని ఇచ్చోడకు బదిలీ చేశారు. అతనికి ఇచ్చోడకి వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. తర్వాత కొన్ని రొజులకు అతను ఇక్కడే ఏకలవ్య స్కూల్లో మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగం వెతుకొని అక్కడ పనిచేస్తున్నాడు. టీఎంఆర్ ఎస్ స్కూల్ నుండి ఇచ్చోడకి బదిలి వ్యవహారంలో టీఎం ఆర్ ఎస్‌ ఉట్నూరు స్కూలు యొక్క ప్రిన్సిపల్ అయిన టి వెంకట ప్రసాద్ కారణం అన్న కోపంతో అతన్ని ఏ విధంగానైనా అతని తప్పులు వెతికి బదనాము చేయాలనే ఉద్దేశంతో ఎదురు చుస్తున్నాడు. అయితే ఈ నెల 19న మోబషీర్ ఆసిఫ్ కలిసి ప్లాన్ చేసుకొని ఉర్దూ పేపర్ కి సంబంధించి టీఎంఆర్ ఎస్‌ ఉట్నూరులో పనిచేసే అబ్దుల్ సమీ టీచర్ ఇంటికి సయ్యద్ కైఫ్ అను అతనిని పంపించి శమీ యొక్క వీడియోలు ఫోటోలు తీసి పంపించమని చెప్పారు. అదే మాదిరిగా సయ్యద్ కైఫ్ అనే వ్యక్తి షాబాద్ అను మరొక్క వ్యక్తిని తోడుగా తీసుకొని శమీ టీచర్ ఇంటికి సుమారు 10:30 సమయంలో వెళ్లగా ఆ సమయంలో శమి గ్రామర్ కు సంబంధించి నోట్స్ ను ఒక తెల్లని కాగితంపై రాసుకుంటుండగా శమీ యొక్క వీడియో ఫోటోలు కైఫ్ తీసి వాటిని వాట్సాప్ ద్వారా ముబాషిర్ కు పంపించారు. తర్వాత ముబాసిర్ ఫోన్ ద్వారా శమి కి ఫోన్ చేసి మాల్ ప్రాక్టీస్ జరుగుతుందా అని గుచ్చి గుచ్చి అడగగా అవును జరుగుతుంది, జ‌డ్పీహెచ్ ఎస్‌నుండి పేపర్ వచ్చింది మరల జవాబులు తయారుచేసి పంపించాము అని అసహనము తొ అనగా అట్టి మాట్లాడిన వాయిస్ రికార్డ్ ని రికార్డ్ చేసి అట్టి వీడియోలు, ఫోన్ కాల్ రికార్డును వాట్సాప్ ద్వారా కాగజ్ నగర్ లో ఉన్న మహమ్మద్ ఆసిఫ్ కి పంపించారు. మహ్మద్ ఆసిఫ్ కాగజ్ నగర్ చెందిన వ్యక్తి కూడా గతంలో టీఎంఆర్ ఎస్ కాగజ్ నగర్ యందు నాన్ టీచింగ్ స్టాఫ్ క్లారికల్ గా పనిచేశాడు. అతను ఉద్యోగం విధులు సరిగా లేకపోవడం వల్ల అప్పుడు అక్కడ పని చేసిన వెంకటప్రసాద్ అను ప్రిన్సిపల్ యొక్క రిపోర్ట్ ఆదారంగా అతన్ని విధుల నుండి తొలగించారు. కాగజ్ నగర్ లో ఉన్న ఎండి అసిఫ్ ఉట్నూర్లో ఉన్నా ముబాషిర్ లు ఇద్దరు కూడా ఈ ప్రిన్సిపాల్ అయిన వెంకటప్రసాద్ వల్లనె ఉద్యోగం పోయి, ఇబ్బంది పడుతున్నామన్న కోపంతో అతనిని ఏదో రకంగా ఇబ్బంది చెయాలనె ఉద్దేశంతో వీరిద్దరూ కైఫ్ సహాయాన్ని తీసుకొని ఈ విధంగా నిర్ణయించుకొని ఈ వీడియోలు ఫోటోలు రికార్డింగు లను ఆధారంగా ఎస్ ఎస్‌సీ ఉర్దూ పేపర్ లీకేజీ , మాస్ కాఫీంగ్ అని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. సమీ ఇంటిలో రాస్తున్న గ్రామర్ కి ఉర్దూ ప్రశ్నపత్రానికి కి ఎలాంటి సంబంధం లేదు. ఆసిఫ్, ముబాషిర్ లు ఇద్దరు వెంకటప్రసాద్ పై వ్యక్తిగత పగలను తీర్చుకునేందుకు, బదనాము చేయడానికి ఫేక్‌ వాయిస్ కాల్, ఇంటిలో ఉర్దూ గ్రామర్ రాసుకుంటున్న ఫొటోస్ వీడియోస్ తో సోష‌ల్ మీడియా లొ తప్పుడు ప్రచారం చేశారు.వీరిపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *