బిర్యానీలో వెండి ఉంగరం ప్రత్యక్షం…

సిరా న్యూస్,మంథని;
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని క్రిష్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో నిన్న రాత్రి కొంతమంది యువకులు కృష్ణ బార్ అండ్ రెస్టారెంట్ కు బిర్యానీ తినడానికి వెళ్లి ఆర్డర్ ఇవ్వగా బిర్యానీ భోజనంలో వెండి చేతి ఉంగరం ప్రత్యక్షమైంది. బిర్యానీలో వెండి చేతి ఉంగరం చూసి కంగు తిన్న కస్టమర్ రెస్టారెంట్ నిర్వాహకుల వద్దకు వెళ్లి కస్టమర్ చూడకుండా భోజనం చేసి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అని కస్టమర్లు రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించిన రెస్టారెంట్ నిర్వాహకుల నుండి ఎలాంటి స్పందన లేదని, పరిశుభ్రత పాటించడం లేదంటూ పాడైపోయిన రెండు రోజులు గడిచిన ఫుడ్ ను మళ్లీ తిరిగి వేడి, వేడిగా ఫుడ్ పెడుతున్నారని, నిర్వహణ సరిగా లేదంటున్న కస్టమర్స్ రెస్టారెంట్ నిర్వాహకులతో ఆందోళనకు దిగారు.మంథని మున్సిపల్ కార్యాలయం లో ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకపోవడం శోచనియామనీ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *