సిరా న్యూస్,ఒంగోలు;
ఒంగోలు నెల్లూరు బైపాస్ లో ఎన్నికల తనిఖీలో భాగంగా కార్లో డబ్బులు తీసుకొని పోతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. ఈ డబ్బులకు ఆధారాలు లేకపోవడంతో ఒంగోలు ఎమ్మార్వో ఆధ్వర్యంలో డబ్బులు సీజ్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు.
పట్టుబడిన నగదు కందుకూరు వద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బీహార్ కూలీలకు ఇచ్చేందుకు ఒంగోలు నగరంలోని ఉన్న అపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి తీసుకెళుతున్నట్టు సమాచారం. పట్టుబడిన నగదు 24 లక్షల 87 వేల 500 వందలు. ఈ నగదు పై సరైన ఆధారాలు లేకపోవడం ఎన్నికల నిబంధనలు అమల్లో ఉండటంవల్ల ఈ డబ్బును ఎమ్మార్వో ఆధ్వర్యంలో ఈ నగదును సీజ్ చేయడం జరిగింది.