బీఎస్పీ జిల్లా అధ్యక్షులు రాజనర్సయ్య
సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లాలో బీఎస్పీ నాయకులు అందరు ఖాళీ అయ్యారని దాసరి ఉష చేసిన వాఖ్యాలు అర్థరహితమని, ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజనర్సయ్య తెలిపారు. బీఎస్పీ జిల్లా కార్యాలయం లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో ప్రజల్లో గుర్తింపు పొందిన ఉష కన్నతల్లి లాంటి పార్టీపై అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. పార్టీని మోసం చేసిన ఉషకు రాబోయె రోజుల్లో రాజకియ జివితం ఉండుదన్నారు. ఉష కోసం నిజాయితిగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పనిచేసారని గుర్తు చేశారు. ఇకపై బీఎస్పీపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఆడ్వైజర్ పేగ నరేష్, ప్రధాన కార్యదర్శి మమిడిపల్లి కాంతయ్య, అర్గనైజింగ్ సెక్రటరి నక్క తిరుపతి, చిప్పకుర్తి శంకర్, జిల్లా మహిళ కో కన్వినర్ కెఎల్ అనిత, పెద్దపల్లి నియెజకవర్గ అధ్యక్షులు బోంకురి దుర్గయ్య, ఉపాధ్యక్షులు నర్ల గొపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సాతురి అనిల్, పెద్దపల్లి టౌన్ అధ్యక్షులు రామిళ్ళ శారద, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు, నాయకులు బొంకూరి సాగర్, కల్వల శ్రీను, బోంకురి అన్వేష్, గాజుల సుజిత్ తదితరులు పాల్గొన్నారు.