సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ లో మేయర్ మహేందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మేయర్ మహేందర్ గౌడ్ కు వ్యతిరేకంగా 16 మంది కోరం సభ్యులు చేతులు లేపారు. ఓడిపోతామని తెలిసి అవిశ్వాస తీర్మానానికి మేయర్ మహేందర్ గౌడ్ వర్గం హజరు కాలేదు. మహేందర్ గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరినా ఫలితం దక్కలేదు.