సిరా న్యూస్,విజయవాడ;
బాలోత్సవ భవన్ లో ఇండియా భాగస్వామ్య పార్టీల & సారూప్య, రాజకీయ, రైతు, కార్మిక, మహిళా, ప్రజా సంఘాల ఐక్య వేదిక సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి హజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఐ నేత రామకృష్ణ, సిపిఎం నేత శ్రీనివాసులు,ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మి నారాయణ, ఇతర ప్రజా, రైతు, మహిళా, కార్మిక సంఘ నేతలు పాల్గోన్నారు.
వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ ఈ దేశానికి బీజేపీ పాలన మంచిది కాదు. బీజేపీ పాలనలో విలువలు దిగజారి పోతున్నాయి. రానున్న తరాలకు ఇది సరి కాదు. బీజేపీ ఈ దేశంలో ఉన్మాదం సృష్టిస్తుంది. మతాలను రెచ్చగొడుతుంది. కులాల మధ్య తగవులు పెడుతుంది. బీజేపీ వి స్వార్థ రాజకీయాలు. వ్యవస్థలను పూర్తిగా బ్రష్టు పట్టించారు. ఇప్పుడు సమయం వచ్చింది. మన పోరాటం రేపటి కోసం. మనం పోరాటం చేస్తున్నది సమయం తో ప్రతి మతం మనుషులు ఒక్కటే అంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం మతం పేరుతో చిచ్చు పెడుతుంది. ఒక మతాన్ని అవమానించడం ..ఒక మతాన్ని రెచ్చగొట్టడం, గోద్రా అల్లర్లు ,మణిపూర్ ఘటన లు ఇందుకు ఉదాహరణ. ఎదురిస్తే పోలీసులను పంపిస్తారని అన్నారు.
బీజేపీ 5 ఏళ్ల పాలన ఒక అరాచకం. దేశ అభివృద్ధి లో బీజేపీ పాత్ర లేనే లేదు. ఈ దేశాన్ని అంబానీ,అదానీ లకి దోచి పెట్టింది. బీజేపీ మెప్పు కోసం స్థానిక ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. ఆంధ్ర లో గంగవరం పోర్ట్ ను తక్కువ ధరకు అదానికి కట్టబెట్టారు. విశాఖ స్టీల్ ను సైతం అదానీ,అంబానీ కి కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. బీజేపీ మెప్పు కోసం జగన్ పని చేస్తున్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఊపిరి లాంటిది.. 10 ఏళ్లు ఇస్తానని బీజేపీ హామీ ఇచ్చింది. హోదా వచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో ఎక్కడో ఉండేది. బీజేపీ చేస్తున్న మోసానికి బాబు,జగన్ లు ఇద్దరు మౌనం వహించారుని అన్నారు.