దోమల బారి నుండి కాపాడండి

కాలనీవాసులు

సిరా న్యూస్,రామడుగు;
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ నుండి తాళ్లలోకి వెళ్లే రహదారి వైపు ఉన్న కాలనీ లోని మురికి కాలువలు గత మూడు సంవత్సరాల నుండి శుభ్రం చేయడం లేదని దుర్గంధం వెరిజల్లు తున్నదని దోమల బెడద ఎక్కువగా ఉందని దోమలతో మలేరియా జ్వరాలు వస్తున్నాయని కాలనీవాసులు మేమే మురికి కాలువలను శుభ్రం చేసుకుంటున్నామని స్థానిక కాలనీవాసులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజుల క్రితం నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణంలో మురికి కాలువ నీరు వెళ్లేందుకు సీసీ రోడ్డు మధ్యలో కనీసం కాలువ నిర్మాణం చేయకుండా అలాగే ఉంచడంతో పాటు మూడు సంవత్సరాల నుండి మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు నిల్వ ఉండడం వల్ల దుర్గంధం వెదజల్లుతుందని దోమలకు అవాసంగా ఉన్నదని కాలనీవాసులు తెలిపారు. కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయించి మురుగునీరు నిల్వ ఉండకుండా పైపును తొలగించి మురికి కాలువ నిర్మాణం చేపట్టారని కాలనీవాసులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *