సిరా న్యూస్, ఆదిలాబాద్
* ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణనే లక్ష్యం
* భద్రతాభావం పెంపొందించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ
* పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండ ఫ్లాగ్ మార్చ్
* జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న కేంద్ర సిఆర్పిఎఫ్ బలగాలు, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్లాగ్ మార్చ్ ను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ లో ప్రజల నందు భద్రతాభావం పెంపొందించేకే నిర్వహించబడతాయని, ప్రజలు ఎటువంటి భయాందోళనకు లోనవ్వకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని ప్రధాన కూడల్లైన ఎన్టీఆర్ చౌక్, వినాయక చౌక్, నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీచౌక్, దేవిచంద్ చౌక్, వన్ టౌన్ మీదుగా వినాయక చౌక్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తానందు ముగిసింది. ఈ సిఆర్పిఎఫ్ సిబ్బంది ముఖ్యంగా ఎన్నికల నందు కీలకమైన విధులైన ఈవీఎంల భద్రత, చెక్పోస్టులు నిర్వహణ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల నందు విధులు, వివి పాట్ ల వద్ద భద్రత, స్ట్రాంగ్ రూముల నందు విధులు నిర్వహిస్తుంటారని పేర్కొన్నారు. విధుల నందు అప్రమత్తతో ఉండి, ఎటువంటి సమస్యాత్మక సందర్భం అయిన సంభవించినప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు కానీ స్థానిక పోలీసులకు కానీ తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సిఆర్పిఎఫ్ కమాండెంట్ శ్రీకాంత్, పట్టణ సిఐలు సత్యనారాయణ, అశోక్, శ్రీనివాస్, ఫణి ధర్, సాయి నాథ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ నవీన్, జిల్లా ఎస్ఐలు రిజర్వ్ సిబ్బంది సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.