Elections:ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై అవ‌గాహ‌న‌

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై అవ‌గాహ‌న‌
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సహాయ కలెక్టర్ వికాస్ మహతో తన ఛాంబర్ లో ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ మనిటరింగ్ కమిటి మొదటి సమావేశం కమిటీ సభ్యులతో నిర్వహించారు.ఈ సమావేశం లో పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఫ్రీ సర్టిఫికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్ మెంట్ లో వచ్చే అంశాల పై మాస్టర్ శిక్షకులు లక్ష్మన్ అవగాహన కల్పించారు. ఎం సి ఎం సి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం తదితర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నీ అతిక్రమించిన పోస్టుల పై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చును లెక్క లో చూపించాలని , దీనికి సంబంధించి సెక్షన్ డి లో స్పష్టం గా పేర్కొనడం జరిగిందనీ ఆమేరకు రోజువారీ ఖర్చు వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలనీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *