సిరా న్యూస్;
-నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి
– నేడు భారతమాత ముద్దుబిడ్డల బలిదాన దినోత్సవం
భరత మాతను బానిసపు సంకేళ్ళు నుండి విముక్తి చేయడానికై, మనందరి సంతోషం.. స్వేఛ్చ కోసం 23 యేళ్ళ వయ్యస్సులోనే అనన్యమైన పోరాటాలు చేసి యావత్త భారత జాతి కి స్పూర్తిని కలిగించడం కోసం.. భరత మాత స్వేచ్చ కోసం ఉరి తాడుని ముద్దాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన భరత మాత ముద్దు బిడ్డల్లు, విప్లవ చైతన్య మూర్తులు సర్ధార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి మర్చి 23న. ఏ స్వార్థం లేకుండా, ఏ పదవులు, ప్రయోజనాలు ఆశించకుండా చిరు ప్రాయంలోనే భరత మాత స్వేఛ్చ కోసం బలిదానం చేసిన ఆ ముగ్గురు యువ కిషోరాల త్యాగాలను మనం స్మరించికొని, వారి వర్ధంతి (23 మార్చి) రోజున వారికి మన హ్రుదయపూర్వకంగా నివాళులు అర్పించడం ఈ దేశ పౌరులుగా మన కనీస బాధ్యత.. ఆ ముగ్గురునీ ఉరి తీసిన రోజు… భగత్ సింగ్ (సెప్టెంబరు 28, 1907 –మార్చి 23, 1931):- స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.భారత స్వాతంత్ర్యోద్యమమునకు పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులల్లో ఆయన ఒకరు. ఈ కారణంగానే ‘షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు’. సుఖ్ దేవ్ థాపర్ (15 మే 1907 – మార్చి 23, 1931):- భారత స్వాతంత్ర్య సమర, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్ మరియు రాజ్గురు ల సహచరునిగా ప్రసిధ్ధి. హరి శివరాం రాజ్ గురు (ఆగష్టు 24, 1908 – మార్చి 23, 1931):- భారత స్వాతంత్ర ఉద్యమ, ఉద్యమకారుడు. మహారాష్ట్ర లోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను భగత్ సింగ్ మరియు సుఖ్ దేవ్ ల సహచరునిగా ప్రసిధ్ధి… 1928లో భారత్లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాలా లజ్పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు.1 సెప్టెంబర్ 1928లో లాహోర్లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 64 ఏళ్ల వృద్ధుడు లాలా లజపతిరాయ్పై సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీచార్జి చేసారు దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్గురు, జై గోపాల్ మరియ సుఖ్దేవ్ థాపర్లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్ను గుర్తించిన జై పాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ జేపీ సాండర్స్ కనిపించినప్పుడు సింగ్కు జై పాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంట పడకుండా ఉండటానికి భగత్ లాహోర్ పారిపోయాడు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందులకు గాను భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన ఈ ముగ్గురు విప్లవకారులు (భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్) లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 సమయానికి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు జరపడం జరిగేది కాదు. వారి మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళిసట్లెజ్ నది తీరాన హుస్సేన్వాలా అనే ఊరిలో దహనం చేశారు. మృత దేహాను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు.దేశమాత వీరపుత్రులైన రాజ్ గురు ,సుఖ్ దేవ్,భగత సింగ్ లను స్మరిద్దాం… వారు చేసిన త్యాగాలను మనమంతా కీర్తిద్దాం … అమర జీవులకిదే ఘన నివాళులు.. ఇన్ క్విలాబ్ జిందాబాద్