ఖమ్మంలోనీ ఓ థియేటర్కు వచ్చి అలరించిన చిత్ర బృందం
సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మంలో రజాకార్ చిత్ర బృందం సందడి చేసింది. నగరంలోని ఒక థియోటర్ కు వచ్చిన రజాకార్ బృందానికి థియేటర్ యాజమాన్యం బాణాసంచా కాల్చి, ఘన స్వాగతం పలికింది. రజాకార్ చిత్ర బృందాన్ని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. సినిమా ఎట్లుందందనీ ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. థియేటర్ కు వచ్చిన వారిలో నటి అనసూయ, రాజ్ అర్జున్, తదితర నటులు ఉన్నారు.
అనసూయ మాట్లాడుతూ సినిమా చూసిన వాళ్లకు అర్థమవుతుంది ఈ చిత్రం మతానికి సంబంధించిన విషయం కాదని. సినిమా చూసిన తర్వాత మీ ఉద్దేశాన్ని మార్చుకుంటారు. రజాకార్ అనే ఘటన మన చరిత్రలో జరిగింది మాత్రమే చూపించారు. డైరెక్టర్ ది ఇది మొదటి సినిమా, ఆయనకు ఉన్న అనుభవం పెట్టి ఈ సినిమా తీశారని అన్నారు.