మంథని నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఏసీ బస్సులు నడపండి

-డిపో మేనేజర్ ను కోరిన కాంగ్రెస్ పార్టీ బీసి సెల్ జిల్లా ప్రధాన కార్యర్శి గోటికార్ కిషన్ జీ

సిరా న్యూస్,మంథని;
నియోజకవర్గ కేంద్రమైన మంథని పట్టణం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రాజధాని ఏసీ బస్సులు నడపాలని కోరుతూ మంథని బస్సు డిపో మేనేజర్ రాజశేఖరం ను కాంగ్రెస్ పార్టీ బీసి సెల్ జిల్లా ప్రధాన కార్యర్శిగోటికార్ కిషన్ జీ శుక్రవారం మంథని డిపోలో కలిసి వినతి పత్రం అందించారు.మంథని నుండి శంషాబాద్ ఏయిర్ పోర్టుకు ఎసీ డిలక్స్ బస్సు వేసినచో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం మంథనినుండి దిల్సుఖ్ నగర్ కు వేసిన బస్సుకు మీరు ఆశించిన కలెక్షన్ రాక పోవచ్చు కాని అదే బస్సును శంశాబాద్ ఎయిర్పోర్టుకు వేసినట్లైతే అటు ప్యాసింజర్లు, ఇటు డిపోకు కూడా ఎంతో ప్రయోజనము చేకూరుతుందన అన్నారు. మంథని పరిసర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టుకు బస్సులు లేనందున మంథని నుండి అద్దె వాహనములలో వెతుతున్నారని దీనివల్ల ప్రయాణికులకు అధిక ఆర్థిక భారంపడుతుందన్నారు. ఈ విషయాన్ని గమనించిమంథని నుండి దిల్సుఖ్ నగర్ తో పాటు మంథని నుండి శంషాబాద్ ఎయిర్పోర్టు కు ఏసి బస్సు సౌకర్యం కలిగించాలని వినతిపత్రంలో కిషన్ జి కోరారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ నాయకులు పార్వతి కిరణ్ పటేల్, మాజీ సర్పంచులు దొరగొర్ల శ్రీనివాస్, నాగుల రాజయ్యలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *