Rajarshi Shah: పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి
* జిల్లా పాలనాదికారి రాజర్షి షా
* పోలింగ్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప‌రిశీల‌న‌
పోలింగ్ కేంద్రాల్లో ఆన్ని సౌకర్యాలు ఖచ్చితంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాదికారి రాజర్షి షా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బోథ్ నియోజక వర్గంలో రెండు పొలింగ్ కేంద్రాలు. భీంపూర్ మండలంలో బెల్సారి రాంపూర్, తాంసి మండలం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 41, 42 పోలింగ్ కేంద్రాలకు సంబందించి మార్పులు చేయడం జరిగిందని, గత ఎన్నికలలో సరైన ర్యాంప్, టాయిలెట్స్ , తదితర సౌకర్యాలు లేక పోవడం తో వీటిని మార్చడం జరుగుతుందని అన్నారు. తాంసి బి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆన్ని సౌకర్యాలు ఖచ్చితంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.అంతకుముందు బెల్సారీ రాంపూర్ లో ని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి రిజిస్టర్లు, పిల్లలకు, తల్లులకు అందిస్తున్న బాలమృతం, పౌష్ఠికాహారం , కోడిగుడ్ల వివరాలను , శ్యామ్ మామ్ పిల్లలు ఎవరైన ఉంటే వారి పై ప్రత్యేక శ్రద్ద వహించాలని బరువు పెరిగేలా, ఆరోగ్యంగా ఉన్నారా, తదితర వివరాలను అంగన్వాడీ టీచర్ ను అడిగి తెలుసుకున్నారు.
పిల్లలతో మాట్లాడుతూ పాటలు పాడించి చాక్లెట్ ఇచ్చి అభినందించారు. స్వయంగా తయారు చేస్తున్న హస్తకళల ను సందర్శించి కావలసిన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని అన్నారు.అనంతరం తాంసి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఆన్ని గదులను పరిశీలించి సూచనలు సలహాలు చేశారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లు, ఎంపిడిఒ లు హస్తకళా కారుడు ఇంద్రజిత్, , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *