సిరా న్యూస్,జగిత్యాల;
శాసన సభ ఎన్నికలు సందర్బంగా కోరుట్ల పట్టణంలోని ఎస్ఎఫ్ఐ స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి పటిష్ట బందోబస్త్ మధ్య తరలించడం జరిగిందని ఎస్పీ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా 94 రూటు మొబైల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ ఆన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్ రాజీవ్ రంజన్ మీనా తో మాట్లాడి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ గురించి తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు.
ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ భీమ్ రావు ,డిఎస్పి రవీంద్ర రెడ్డి ఉన్నారు.