టీడీపీ అభ్యర్దికి మద్దతివ్వం

సొంత పార్టీ నేతల ఆగ్రహం
సిరా న్యూస్,బాపట్ల;
బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టిక్కెట్ ఎం.ఎం. కొండయ్యకు కేటాయించటం పై తేదేపా సీనియర్ నాయకురాలు సజ్జా హేమలత మండిపడ్డారు.సజ్జా హేమలత తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె కొండయ్య స్థానిక చేనేత నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఖండించారు. చీరాల అసెంబ్లీ టిక్కెట్ పార్టీ అధిష్టానం కేటాయించగానే చేనేతలను చులకన చేసి మాట్లాడటం పై ఆమె మడిపడ్డారు.ఇదే కొండయ్య గతంలో వైస్సార్సీపిలో ఉన్నప్పుడు చంద్రబాబును చులకనగా మాట్లాడారని ఆమె గుర్తుచేశారు.అత్యధికంగా చేనేతలు ఉన్న చీరాలలో పోటీ చేయడానికి చేనేతలు పనికి రారా..మేము వేరెవరికో పల్లకీలు మొయ్యలా అని ప్రశ్నించారు. కొండయ్య చేనేతల పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చేనేత జాతికి క్షమాపణలు చెప్పాలని హేమలత డిమాండ్ చేశారు.చంద్రబాబు చీరాల నియోజకవర్గ అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని చేనేతలను అవమానించిన కొండయ్యకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఆమె అన్నారు..రాష్ట్ర వ్యాప్తంగా కొండయ్య,చంద్రబాబు తీరుపై చేనేత నాయకులంతా ఏకమై పోరాడతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *