Prabhakar Reddy: భ‌గ‌త్‌సింగ్ ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాలి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
భ‌గ‌త్‌సింగ్ ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాలి
* సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి
భ‌గ‌త్‌సింగ్ ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాల‌యంలో శ‌నివారం భ‌గ‌త్‌సింగ్‌, గురుదేవ‌, సుగుదేవ వ‌ర్దంతి ని నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ వారసులుగా యువత ముందుకు పోవాలన్నారు. మతోన్మాదం నశించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడి మతోన్మాదాన్ని కొట్టాలన్నారు. నేడు యువత భగత్ సింగ్ లాగా దేశం కోసం పాటుపడాలని, అప్పుడే భారతదేశం భగత్ సింగ్ ఆశయాన్ని కొనసాగించిన వారైతామని కొనియాడారు. జిల్లాలో యువత ఉద్యమాలు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందు ఉండాలని అన్న్ఆరు. భగత్ సింగ్ ఆదర్శంగా నిలవాలని సూచించారు. గురుదేవ, సుగుదేవ, భగత్ సింగ్ ల ప్రాణ త్యాగం చరిత్రలో మరిచిపోలేని ఘట్టమని చెప్పారు.కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటల రాము లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బికేఎం యు ప్రధాన కార్యదర్శి అర్ధాంగి రమేష్ , అధ్యక్షులు ఖండాల గణేష్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షు లు గేడం పొచ్చి రామ్, సిపిఐ సీనియర్ నాయకులు బెజ్జంకి నర్సింగ్ రావు , పట్టణ సీనియర్ నాయకులు ఎం వెంకటస్వామి, సీపీఐ సీనియర్ నాయకులు వెల్చల్ సుభాష్, సీపీఐ మావ‌ల సీనియర్ నాయకులు పెద్ది నరసింహులు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *