Venkat Reddy:రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం

సిరా న్యూస్, సైదాపూర్
రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మ‌న్‌ బిల్లా వెంకట్ రెడ్డి
రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన ధ్యేయమని ప్రాథమిక వ్యవసాయ సంఘం అధ్యక్షులు బిల్లా వెంకట్ రెడ్డి అన్నారు. వెన్కేపల్లి-సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలోని సొసైటీ కార్యాలయ ఆవరణలో శనివారం చెల్మల్ల మల్లారెడ్డి అధ్యక్షతన మహాజన సభ జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, ఎరువులను విక్రయిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. 1923లో సహకార సంఘాలను నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలు కాకుండా రుణాలు అందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే సహకార సంఘాల ముఖ్య ఉద్దేశమని వివరించారు. నాటి సహకార సంఘాల స్ఫూర్తి నేటికీ కొనసాగుతున్నదని వెల్లడించారు.రైతులకు కొంతమందికి రుణమాఫీ అయ్యిందని ఇంకొంతమంది కాలేదని త్వరలో ప్రభుత్వం నుంచి స్పష్టత రానుందని అన్నారు. రైతుల సహాయ సహకారాలతోనే నూతన సొసైటీ భవనం పూర్తయిందని, త్వరలో వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సంఘం ద్వారా రైతులకు, ప్రజలకు ఏటీఎం సేవలు, సిఎస్సి కామన్ సెంటర్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఇకనుండి మండలాలకి వెళ్లే వ్యయ ప్రయాసలు లేకుండా గ్రామ సొసైటీ లోనే అన్ని రకాల సేవలు వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సంఘం ద్వారా అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి,ఉపాధ్యక్షులు గుండేటి శ్రీనివాస్,సభ్యులు రాజిరెడ్డి దొనపాటి రామ్ రెడ్డి, మొలుగూరి సౌందర్య, మొలుగూరి సంపత్, వెంగళ కోమల,బండి తిరుపతి, కౌడగాని మోహన్ రావు, గడ్డం అబ్బయ్య, చెల్మెల్ల రాజేశ్వర్ రెడ్డి, తదవేని కనుకయ్య, సంఘ సిబ్బంది చెల్మేల్ల మల్లారెడ్డి, కొట్టే భాస్కర్ రెడ్డి ,సంగాల సంపత్, తాడిచర్ల మహేష్, సంగాల సుశీల, వెన్నం మహేందర్ రెడ్డి, బీస రాజు, వోరుగంటి అనిల్ రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *