సిరా న్యూస్,పెద్దపల్లి;
శాతవాహన యూనివర్సిటీ కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్ బిల్డింగ్ ఆవరణలో నిర్వహించిన యూనివర్సిటీ స్థాయి మేనేజ్మెంట్ మీట్ శాతవాహన ఆరోహణ 2024 కార్యక్రమములో గాయత్రి డిగ్రీ & పీ . జీ కళాశాల కు చెందిన బిబిఎ విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో బిబిఏ సెకండ్ సెమ్ విద్యార్థులు పి. అంజలి జి .కావ్య ఎం. రవిత్రేనీ, పి. మౌనిక , జే.రోహిత ఆడ్ మేకింగ్ లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. కళాశాల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గాయత్రి కళాశాలలో చదివే విద్యార్థులకు విద్యతోపాటు అన్ని రంగాలలో ప్రావీణ్యం కల్పిస్తున్నామని తెలియజేస్తూ గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది అదే విదంగా కళాశాల ప్రిన్సిపల్ జే .రవీందర్, లెక్చరర్స్ విద్యార్థులను అభినందించడం జరిగింది.