Rajarshi Shah: పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలి

సిరా న్యూస్,గుడిహ‌త్నూర్‌
పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలి
* జిల్లా పాలనాధికారి రాజర్షి షా
పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రం, గోండ్ హర్కాపూర్ లోని అంగన్వాడీ కేంద్రం, మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల, పోలింగ్ కేంద్రం ను, గుడిహత్నూర్ లోని మండల ప్రజా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి రాజర్షి షా ప‌రిశీలించారు. ఈ సందర్భంగా మొదటగా తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి విద్యార్ధుల హాజరు శాతాన్ని ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. మొత్తం విద్యార్ధులు 280 కాగా అందులో ఇద్దరు విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని ఆన్నారు. ప్రతీ గదిని పరిశీలిస్తూ విద్యార్ధుల కొరకు ఏర్పాటు చేసిన సౌకర్యాల పై ఆరా తీశారు. అనంతరం గోండ్ హర్కాపూర్ లోని అంగన్వాడీ కేంద్రం లో పిల్లల పెరుగుదల పర్యవేక్షణ చార్ట్ లో ఉన్న వయసుకు తగ్గ బరువున ఏ వయసులో ఎంత ఉండాలి ఆరోగ్యంగా ఉండే పిల్లలకు, అనారోగ్యంగా ఉండే పిల్లలకు , తల్లులకు సంబంధించిన వివరాలను అంగన్వాడీ టిచర్ ను అడిగి తెలుసుకున్నారు.అంగన్వాడీ లో ఇస్తున్న పౌష్ఠికాహారం తో పాటు పిల్లలకు ఫ్రీ స్కూల్ కిట్ ద్వారా ఆటపాటలు నేర్పించాలని ఆన్నారు.రీడింగ్ రూమ్ ఖాళీగా ఉండడం తో అందులో గోండి భాషకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేయాలని సూచించారు.పోలింగ్ కేంద్రం 118 లో కావలసిన వసతులు ఏర్పాటు చేయాలని, ర్యాంపులు, అవసరమైన మరమ్మతులు చేయించుకోవాలని , పోలింగ్ కేంద్రం లో ఆన్ని సదుపాయాలు ఏర్పాటుచేయాలని ఎమ్మార్వో కవితా రెడ్డిని ఆదేశించారు. తదుపరి గుడిహత్నూర్ లోని ఉర్దూ మీడియం పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రిజిష్టర్ లను, ఈ రోజు ఓపీలో ఎంతమంది ని పరీక్షించారు, ఐబీ కేసులు ఎన్ని వచ్చాయని, ప్రతి గదిని , మందులను పరిశీలించి పలు సూచనలు చేశారు.పాఠశాలలో ఉన్న సమస్యల ను త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కవితా రెడ్డి, ఎంపిడిఒ, ఎంపీఓ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *