సిరా న్యూస్,మచిలీపట్నం;
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా సమాచార శాఖలో పొరుగు సేవల ఉద్యోగుల సేవలు ఉపసంహరిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా సమాచార పౌర సంబంధాధికారి శ్రీ ఎం. వెంకటేశ్వర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి జారీ చేసిన సర్కులర్ మెమో నెంబర్. 4539/అడ్మిన్-1-1/2019, తేదీ 19.3.2024 ఉత్తర్వులలో పేర్కొన్నారని ఆయన తెలిపారు. కృష్ణాజిల్లా సమాచార శాఖలో పొరుగు సేవల విధానంలో పని చేస్తున్న పిఆర్వో ఎన్.జాన్సన్ జాకబ్, వీడియో గ్రాఫర్ ఎ.అజీజ్ ల సేవలను కూడా ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై వీరితో ఎలాంటి అధికారిక సంప్రదింపులు జరపరాదని, వీరు చేసే కార్యకలాపాలతో ఈరోజు నుండి ఈ కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.
==================