సిరా న్యూస్, బోథ్
ఆదిలాబాద్ సీటీఓను కలిసిన చైర్మన్
ఆదిలాబాద్ జిల్లా వాణిజ్య పన్నుల అధికారి ఎన్. మోహన్ ను శనివారం బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ బోథ్ మార్కెట్ కు సంబందించిన ఆర్థిక పన్నుల విషయం లో సహకరించి మార్కెట్ అభివృద్ధి కి తొడ్పాడాలని విన్నవించారు. సీటీఓ మాట్లాడుతూ బోథ్ మార్కెట్ కు ఎల్లవేళలా తమ పరస్పర సహకారం ఉంటుందని తెలియజేశారు.