సిరా న్యూస్, కుందుర్పి
కేంద్రం కక్షపూరిత చర్యలు మానుకోవాలి
* మాజీ ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజనేయులు
కేంద్రం ప్రభుత్వం ఆర్డిటి స్వచ్ఛంద సంస్థపై కక్షపూరిత చర్యలు మానుకోవాలని మాజీ ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజనేయులు అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య ఆదేశాల మేరకు శనివారం కుందుర్పి మండల కేంద్రంలో స్థానిక ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డిటి సంస్థ పై కక్ష సాధింపు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసన కార్యక్రమము చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి రాజగోపాల్, ఎంపీపీ కమల నాగరాజు, మార్కెట్ డైరెక్టర్ లింగప్ప కరిగానపల్లి తిప్పేస్వామి, జోంబుగుంపుల సర్పంచ్ గంగాధర, యనమల్ దొడ్డి సర్పంచ్ తనయుడు విజయ్ , ఎక్స్ ఎంపీటీసీ తిప్పేస్వామి , ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సాకే గురుమూర్తి, కళ్యాణదుర్గం తాలూకా కన్వీనర్లు అనంపల్లి రామన్న కృష్ణాపురం బాబు , గౌరవ అధ్యక్షులు అనుపల్లి మారన్న ,శెట్టూరు మండల అధ్యక్షులు వెట్టి తిప్పేస్వామి, కుందుర్పి మండల నాయకులు నిజవల్లి హరీష్, నిజవల్లి నరసింహ, దురుగప్ప, కృష్ణపురం మారుతీ, చంద్ర, జమ్ము గుంపుల హనుమంతరాయుడు కంబదూరు మండల నాయుకులు, అండేపల్లి, హరి, కళ్యాణదుర్గం మండల నాయుకులు బొట్టువానిపల్లి, తిప్పేస్వామి, తదితరులు పాల్గొన్నారు