సిరా న్యూస్,బజార్హత్నూర్
విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి
షీ టీం సభ్యులు
విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని షీ టీం సభ్యులు అన్నారు. శనివారం బజార్ హత్నూరు మండలం లోని పిప్పిరి జడ్పీ హైస్కూల్ ను షీ టీం సభ్యులు సందర్శించారు. అనంతరం విద్యార్థులకు షీ టీంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులపై ఎలా ముందుకు వెళ్లాలని అంశాలపైన చర్చించారు. సోషల్ మీడియాలో ఎక్కువసేపు కాలక్షేపం కాలక్షేపన చేయకుండా పిల్లలు బాగా చదవాలని పిల్లలకు తెలిపారు. ఈవీటీజింగ్, ర్యాగింగ్, అమ్మాయిలను అసభ్యంగా మాట్లాడిన వారి పట్ల అసభ్యంగా ప్రవరించినా షీటీం సభ్యులకు తెలుపాలన్నారు. షీ టీం నంబరు 8712659953 కాల్ చేయాలని సూచించారు.గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు. సమావేశంలో షీ టీం సభ్యులు సుశీల సత్యమోహన్ స్కూల్ హెచ్ఎం, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.