పశువులకు గాలికుంటు టీకాలు వేసిన గోవింద నాయక్..

సిరా న్యూస్ ఇచ్చోడ:

పశువులకు గాలికుంటు టీకాలు వేసిన గోవింద నాయక్..

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామంలో పశువులు, గేదెలు, ఎద్దులకు ఆదివారం మండల పశు వైద్యాధికారి డాక్టర్ గోవింద్ నాయక్ గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఒక్కటే మార్గమని అన్నారు. టీకాలు వేయడంతో పశువులు ఈ వ్యాధి బారిన పడకుండా అరికట్టవచ్చని అన్నారు. వ్యాధిసోకిన పాడి పశువుల్లో తగ్గే పాల ఉత్పత్తిని శాశ్వతంగా నివారించవచ్చన్నారు. పశు వైద్యశాఖ అధికారంలో గ్రామాల్లో ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది శేఖర్, దేవరావు, పాడి రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *