వైభవంగా డోలోత్సవం

సిరా న్యూస్,సింహాచలం;
సింహాచల శ్రీవరలక్ష్మీనృసింహస్వామివారి డోలోత్సవము వైభవంగా జరిగింది . ప్రతి ఏటా పాల్గుణ పౌర్ణమి రోజున జరిగే ఈ ఉత్సవాన్ని బొట్టే నడిగే పౌర్ణమిగా వర్ణిస్తారు . ఈ ఉత్సవం లో బాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాత సేవతో మెల్కొలిపి పవిత్ర గంగధార జలాలతో అభిషేకించి నిత్యారధనలు నిర్వహించారు .అనంతరం స్వామివారిని మెట్ల మార్గంలో కొండదిగువకు పల్లకీలో తీసుకువచ్చారు . ఏప్రిల్ 19 న తేదీన జరిగే స్వామివారి కళ్యాణమహోత్సవంలో భాగంగా అప్పన్న సోదరి శ్రీ పీడితల్లమ్మ అమ్మవారి ఆలయానికి వెల్లి పిల్లనిచ్చి వివాహాం జరిపించమని అడిగే కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం స్వామివారు ఆనందంతో పుష్కరిణి సత్రం ఉద్యానమండపానికి వచ్చి వసంతోత్సవం జరుపుకున్నారు . దీనిలో బాగంగా స్వామివారి కి విశ్వక్షేణ ఆరాధన ,పుణ్యాహవచనం నిర్వహించి ,డోలికల్లో ఊయల సేవ నిర్వహించారు . ఈ కార్యక్రమం అనంతరం వైదికులు ,గ్రామ ప్రజలు ,భక్తులు వసంతాలు జల్లుకుని వసంతోత్సవం జరుపుకున్నారు . అనంతరం మూఢవీధుల్లో స్వామివారి తిరువీది నిర్వహించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *