జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర రాష్ట్రానికి ఆదర్శం కావాలి

వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

సిరా న్యూస్,బద్వేలు;

రాష్ట్ర ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు ఈనెల 27వ తేదీ నుంచి చేపట్టిన బస్సు యాత్ర రాష్ట్రానికి ఆదర్శం కావాలని వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి చేసిన సేవలు శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. సంక్షేమ పథకాలతో దేశంలోనే మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సేవలు అందించినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు
. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు కడప జిల్లాలోని ప్రతి నాయకుడు కార్యకర్త హాజరుకావాలని కోరారు. ఈనెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో
బస్సు యాత్రను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈనెల 27వ తేదీ ఇడుపులపాయ లో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్రారంభిస్తారు అన్నారు వీరపునాయనపల్లి
ఎర్రగుంట్ల మీదుగా అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంతంలో విడిది చేస్తారని తెలిపా. భోజనం విరామం అనంతరం సినీ హబ్ ఆర్టీసీ బస్టాండ్ శివాలయం రాజీవ్ సర్కిల్ కొర్రపాడు రోడ్డు మీదుగా ప్రొద్దుటూరు రింగ్ రోడ్డులో తిమ్మయ్య కళ్యాణ మంటపం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను జయప్రదం చేయాలని రాయలసీమ ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆశీర్వదించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *