శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు విరాళం

సిరా న్యూస్,కౌతాళం;
కౌతాళం మండలం పరిధిలో పుణ్యక్షేత్రానికి భక్తులు విరాళం శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి హైదరాబాద్ వాస్తవ్యులు గంట హనుమంతప్ప మరియు కుటుంబ సభ్యులు వారు .100,116/- చెక్ రూపంలో విరాళంగా చెల్లించారు. దేవస్థాన డిప్యూటీ కమిషనర్ & ఈవో హెచ్ జి వెంకటేశ్వర్లు దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్, పూలమాలతో సత్కరించారు, మరియు, కర్నూలు వాస్తవ్యులు గ్రండే శ్రీనివాసులు శ్రీలత వారు.50,000/- విరాళంగా చెల్లించియున్నారు. దేవస్థాన డిప్యూటీ కమిషనర్ & ఈవో హెచ్ జి వెంకటేశ్వర్లు దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్, పూలమాలతో సత్కరించారు,ఈ కార్యక్రమం లో సూపర్డెంట్ జె కె మల్లికార్జున, సూపర్డెంట్ కె వెంకటేశ్వర్లు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *