సిరా న్యూస్, ఆదిలాబాద్:
రైతులకు సద్ది డబ్బాలు పంపిణీ చేసిన సురేందర్ రెడ్డి, పద్మా దంపతులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కామాయి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, పద్మా దంపతులు రైతులు, రైతు కూలీలకు సద్ది డబ్బాలు పంపిణీ చేశారు. సోమవారం ఈ మేరకు తమ స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో 50 మందికి సద్ది డబ్బాలు అందించి తమ ఉదారత చాటుకున్నారు. ఇటీవలే తమకు మనువరాలు జన్మించడం తో గ్రామస్తులతో ఇలా తమ సంతోషాన్ని పంచుకున్నారు. దీంతో పాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో అన్నదానం సైతం నిర్వహించారు.