Prasannajaneya: ఘనంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శోభయాత్ర

సిరాన్యూస్ ,సైదాపూర్
ఘనంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శోభయాత్ర
* భక్తులకు మహా అన్నదానం
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో సోమవారం  శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్టలో భాగంగా గోపూజ ,మంగళవాయిద్యలతో దేవతా విగ్రహాములతో శోభాయాత్ర నిర్వహించారు. సాయంత్రం గణపతి పూజ, పుణ్యహవాచనము, రక్షాబంధనము, పంచగవ్య ప్రాశన, అఖండ దీపారాధన, ఋత్విక్వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ ధ్వజ మూర్తి కుంభారాధన, యంత్ర బింబ మూర్జనములు, అగ్నిప్రతిష్ట, మూలమంత్ర హవనములు, జలాధివాసాంగ హోమము, జలాధివాసము, క్షీరాధి, పంచామృత అధివాసములు, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థప్రసాద లతో అర్చకులు శేషం వెంకట రమణచార్యులు, యజ్ఞచార్యులు, నవ్యానంద చార్యులు, పురుషోత్తమచార్యులు, మణికంఠ చార్యులు, మనోహరచార్యులు, శేషం మాధవాచార్యులు, అఖిల్ చార్యులు ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు.ఈ సందర్భంగా స్వామివారి విగ్రహాలను గ్రామంలోని పురవీధుల గుండా ట్రాక్టర్ పై ఊరేగించారు. వాడ వాడలా ఊరేగింపు వెళ్ళిన స్వామి వారికి గ్రామ ప్రజలు పూలు, పండ్లు, కొబ్బరికాయలతో గడప గడపకు స్వాగతం చెప్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి, తాజా మాజీసర్పంచ్ అబ్బిడి పద్మ రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డి, లయన్స్ క్లబ్ చైర్మన్ కొండ వేణుమూర్తి, గట్టుదుద్దెనపల్లి ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ శంకర్ లింగం, గ్రామ పెద్దలు దొంతుల లింగారెడ్డి, కంది రమణారెడ్డి, కొంపల్లి సుధాకర్ రెడ్డి, సారాబుడ్ల శ్రీనివాస్ రెడ్డి, బోడ సుధాకర్ రెడ్డి, సారబుడ్ల భగవాన్ రెడ్డి, మూల చంద్రారెడ్డి, కంది రాజిరెడ్డి, కంది ప్రసాద్ రెడ్డి, సందుపంట్ల రవీందర్ రెడ్డి, పేరాల రవీందర్, గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *