సిరా న్యూస్,హైదరాబాద్;
నల్లకుంట డివిజన్, సత్యా నగర్, రత్న నగర్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం పర్యటించారు. బస్తీ పర్యటన లో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో పర్యటించారు. ఈ పర్యటన లో కిషన్ రెడ్డి కి కాలనీల్లో అడుగడుగునా సాధర స్వాగతం లభించింది. మహిళలు, కాలనీ పెద్దలు, పుర ప్రముఖులు బీజేపీ కార్యకర్తలు కిషన్ రెడ్డి ని అక్కున చేర్చుకున్నారు, కాలనీ పెద్దలను పుర ప్రముఖులను కార్యకర్తలను పలకరిస్తు ముందుకు సాగారు. తరువాత వివిధ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సరదగా కాసేపు ముచ్చటించారు
================