సిరా న్యూస్,మేడ్చల్ ..;
గాజులరామరం జిహెచ్ఎంసి పరిదిలోని షాపూర్ నగర్ కూరగాయాల మార్కెట్ లో జిహెచ్ఎంసి జవాన్ చందర్ అత్యుత్సాహం బెడిసికొట్టింది. ఎంక్రోచ్మెంట్స్ కంప్లైంట్ తో తోపుడు బండ్లు,రోడ్డుపై ఉన్న రేకులను పక్కకు జరపాలన్న డిసి ఆదేశాల బేకాతరు చేస్తూ జేసిబితో తోపుడు బండ్లతో పాటు సర్టిపై కూరగాయాల షాప్ లను సైతం పూర్తిగా ద్వంసం చేసాడు జవాన్ చందర్. 2017లోనే గ్రీన్ మార్కెట్ జోన్ పరిధంటూ జీహెచ్ఎంసి లైసన్స్ మంజూరుచేసింది. మార్కెట్ లో కూల్చివేతలకు ముందు ఎలాంటి నోటీసులు అందివ్వకుండానే తెల్లవారుజామున 4.30గంటలకు షాప్ ల ద్వంసం పై కూరగాయాల షాప్ నిర్వాహకులు సీరియస్ అయ్యారు. జేసిబితో పూర్తి కూల్చివేతకు పాల్పడ్డ జిహెచ్ఎంసి జవాన్ చందర్ ను . గాజులరామరం సర్కిల్ డిసి మల్లారెడ్డి,
సస్సెండ్ చేసారు.