సిరాన్యూస్, ఇచ్చోడ
వ్యవసాయంపై రైతులకు అవగాహన
ఇచ్చోడ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం (వీడియో కాన్ఫరెన్స్ దృశ్య శ్రవణ విధానం ద్వారా) నిర్వహించారు. ఈసందర్బంగా ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అఖిలభారత సమగ్ర వ్యవసాయ పద్ధతుల పరిశోధన విభాగం హైదరాబాద్ రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు రామగోపాల వర్మ, గోవర్ధన్ సమగ్ర వ్యవసాయం, డ్రోన్ లతో వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి జాదవ్ కైలాస్, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.