Payal Shankar:ఐదు రూపాయలకే భోజనం

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
ఐదు రూపాయలకే భోజనం
* అన్నదానం కన్నా మించింది లేదు
* ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
అన్నదానం కన్నా మించింది లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా ఇస్కాన్, పాయల్ శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని స్థానిక వినాయక చవితి లోని గోపాలకృష్ణ మఠం వద్ద గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి, ఇస్కాన్ నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దానాలలో కెల్ల అన్నదానం గొప్పదనీ, అటువంటి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమకు వీలైనంతలో చేయాలని ఆయన అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఇటు రైతు బజార్, వినాయక ప్రాంతాలకు చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు వివిధ పనుల కోసం వచ్చేవారు అధిక సంఖ్యలో ఉంటారు ఇటు రైతు బజార్ లో కూడా రైతులు ఉంటారు. వీరందరికీ అతి తక్కువ ధరతో అంటే చాయ్ కన్నా కూడా తక్కువ ధరతో వారికి భోజనం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇస్కాన్ సంస్థ వారితో కలిసి పాయల్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. కార్యక్రమం లో ఇస్కాన్ సంస్థ నిర్వాహకులు భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *