ఈనెల 30వ తేదీన బీజాపూర్ బందుకు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ

 సిరా న్యూస్,బీజాపూర్;
మావోయిస్టు పార్టీ ఈనెల 30వ తేదీన బీజాపూర్ బందుకు పిలుపునిచ్చింది. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా మార్చి 30న బందుకు పిలుపునిచ్చింది. జనవరి నెల నుండి ఇప్పటివరకు 15 మంది అమాయక గిరిజనులను ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈనెల 30న బందు నేపథ్యంలో రవాణా మరియు వ్యాపార సంస్థలను పూర్తిగా మూసివేయాలని మావోయిస్టులుహెచ్చరించారు. పశ్చిమ బస్తర్ మావోయిస్టు డివిజన్ కార్యదర్శి మోహన్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *