తెలంగాణ రాష్ట్రంలో కరువు చాయలు కనిపిస్తున్నాయి

మాజీ మంత్రి సబిత
 సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్రం లో కరువు చాయలు కనిపిస్తున్నాయని పంటలు ఎండిపోయి,చెరువులు ఇంకిపోయి,ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేయబడుతున్నాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ, ఆర్కేపురం లోని అతి పురాతనమైన ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం 50వ వార్షిక బ్రహ్మోత్సవ లో ఎమ్మెల్సీ దయానంద కలిసి సబితా ఇంద్రారెడ్డి పాల్గోన్నారు.
కరువుకు తావు లేకుండా కెసిఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో భగవంతుని సంకల్పంతో హోమాలు,పూజలు నిర్వహించారని రైతులు పంటలు పుష్కలంగా పండించుకొని,ప్రజలు సుఖ సంతోషంగా ఉన్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దేవుని ఆశీర్వాదం రాష్ట్ర ప్రజల పై ఉండాలని గత పది సంవత్సరాల్లో అందరి మత విశ్వాసాలను కాపాడుకుంటూ వచ్చామని తెలిపారు. గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలను పునరుద్ధరిస్తూ సకల సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *