సిరా న్యూస్, ఆదిలాబాద్:
+ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు
+భారీగా హాజరుకానున్న భక్తులు..
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం రథోత్సవానికి ముస్తాబయింది. ప్రత్యేక స్వామి వారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాది సైతం రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించే రథోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.