హైకోర్టులో వ్యాజ్యం దాఖలు
సిరా న్యూస్,విజయవాడ;
బీసీ కులానికి చెందిన తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీగా చలామణి అవుతూ తప్పుడు కుల ద్రవీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారని మాదంవారి గూడెం కి చెందిన మడకం వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ విషయంపౌ ఇప్పటికే కలెక్టర్ కి రిపోర్టు దాఖలు చేసారు పిటిషనర్. పిటిషనర్ కంప్లైంట్ ని పరిగణలోకి తీసుకోకుండా తెల్లెం రాజ్యలక్ష్మి ఎస్ టి అంటూ బుట్టాయిగూడెం తాసిల్దార్ ఉత్తర్వులు జారీ చేసారు. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ చట్టం ప్రకారం కలెక్టర్ మాత్రమే ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ వాదన. పిటీషన్ అత్యవసరంగా విచారణ చేయాలని హైకోర్టును న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోరారు పిటిషన్ పై రేపు వాదనలు వింటాం న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తేళ్ళాం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోలవరం నుంచి టికెట్ తగ్గించుకున్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించునున్నారు.