సింగల్ విండో చైర్మన్ భాస్కరరావు.
సిరా న్యూస్,కమాన్ పూర్;
కమాన్ పూర్ వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు అందజేయడం జరుగుతుందని వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ ఇనగంటి భాస్కరరావు అన్నారు.
మంగళవారం కమాన్ పూర్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం కార్యదర్శి తిమ్మరాజు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ భాస్కరరావు మాట్లాడుతూ ఏప్రిల్ నుండి రైతులకు స్వల్ప కాలి క సుమారు మూడు కోట్లు దీర్ఘకాలిక ఐదు కోట్ల రుణాలు రైతులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ సహకార పర్పస్ సంఘం పరిధిలోని 11 కేంద్రాల్లో ఈ రబి సీజన్లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం సహకార సంఘం నుండి 342మంది రైతుల 1 కోటి 94 లక్షల 73 వేల 369 రుణమాఫీ అయినట్లు చైర్మన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 327 మంది రైతులకు స్వల్పకాలిక 2 కోట్ల 80 లక్షల 77 వేల 25 రూపాయలు 30 మంది రైతులకు కోటి 61 లక్ష 70 వేలు మంజూరు చేయడం జరిగింది. రైతులు సకాలంలో స్వల్పకాలిక రుణాల వడ్డీ వెంటనే చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ వైస్ చైర్మన్ చిందం తిరుపతి సభ్యులు వైనాల రాజు వరాల నరసింగం అడువాల చంద్రయ్య జనగామ తార సైన్డ్ల సత్యనారాయణ బానోతు లక్ష్మి పూదరి నరేష్ భోగి లింగయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.