తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

రాబోయే ఐదురోజుల్లో మరింత ఎండల తీవ్రత వాతావరణ శాఖ హెచ్చరిక
సిరా న్యూస్,హైదరాబాద్ ;
;తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగేఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 27 నుంచి 30 వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నారాయణపేట, ఖమ్మం,మహబూబాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.రాగల ఐదురోజుల పాటు రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లోఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో 42 డిగ్రీలను దాటాయి. రాత్రి పూట 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లాసత్నాల, తలమడుగులో అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. చాప్రాలలో 42.1, ఆసిఫాబాద్‌ 42 డిగ్రీలు నమోదవగా.. పలు జిల్లాల్లో 40కిపైగా ఉష్ణోగ్రతలు
రికార్డయ్యాయని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *