అమలులోకి కొత్త ఎక్సైజ్ పాలసీ వైన్స్ టెండర్లు దక్కించుకున్నోళ్లకు రెండేండ్లు చాన్స్

సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఎక్సైజ్ పాలసీ శుక్రవారం నుంచి అమలు లోకి వచ్చింది. తెలంగాణలోని 2,620 వైన్ షాపుల లైసెన్సు గడువు నవంబర్ 30వ తేదీతో ముగిసింది. ముందస్తుగా ఆగస్టు నెలలో నిర్వహించిన టెండర్లలో వైన్ షాపుల లైసెన్స్ లు దక్కించుకున్నవారు డిసెంబర్ 1 నుంచి రెండేండ్ల పాటు మద్యం దుకాణాలను నిర్వహించనున్నారు. వైన్ షాపుల టెండర్లకు ఆగస్ట్ లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2,620 వైన్స్ లకు 1,31,490 అప్లికేషన్లు వచ్చాయి.
ప్రభుత్వానికి కేవలం దరఖాస్తుల ద్వారానే రూ.2,629 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక నవంబర్ నెలలో లో దాదాపు రూ.2,200 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నెలాఖరులోగా పాత స్టాక్ను క్లియర్ చేశారు. ఒక్క నెలలోనే 21.69 లక్షల లిక్కర్ కేసులు, 30.44 లక్షల కేస్ల బీర్లు అమ్ముడు పోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *