సిరాన్యూస్, భీమదేవరపల్లి
అంబేద్కర్ ఆశయాలకనుగునంగా సంఘాలు పనిచేయాలి
* తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాలా ప్రకాష్
* కొత్తపెల్లి తెలంగాణ అంబేద్కర్ సంఘం కమిటీ ఎన్నిక
బహుజన వాదాన్ని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్ సంఘాలు పనిచేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాలా ప్రకాష్ రాష్ట్ర అధికార ప్రతినిధి తూముల సదానందం అన్నారు. బుధవారం భీమదేవరపల్లి మండలంలోని కొత్తపెల్లి గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాలా ప్రకాష్ రాష్ట్ర అధికార ప్రతినిధి తూముల సదానందం హాజరై మాట్లాడారు. బహుజన వాదాన్ని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్ సంఘాలు పనిచేయాలని సూచించారు. స్త్రీ పురుషులకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. కార్యక్రమంలో కోకన్వీనర్ కొమ్ముల రవీందర్, తాడూరు చిరంజీవి , కొత్తపల్లి గ్రామ నూతన అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు శిఖ సురేష్, ఉపాధ్యక్షులు శిఖ కరుణాకర్, ప్రధాన కార్యదర్శి శిఖ క్రాంతి, ప్రచార కార్యదర్శి వేల్పుల రాజేష్, కార్యదర్శి పులి కర్ణాకర్, సంయుక్త కార్యదర్శి రేణిగుంట్ల శ్రీనాథ్, కోశాధికారి రుద్రారపు రజినీకాంత్, గౌరవ అధ్యక్షులు సిక అశోక్ , గౌరవ సలహాదారులు శిఖ బాబు, పులి వెంకటరాజం శిఖ స్వామి, పులి ప్రకాష్ కార్యవర్గ సభ్యులు శిఖ పవన్, వేల్పుల అనురాగ్ కోయడ, అజయ్, పులి నీరజ, వేల్పుల సుధీర్ ,ఆరేపల్లి దయాకర్, మండేద్దుల రాజు, శిఖ విజయ్, మేక వినయ్ శిఖ విజయ్, తదితరులు పాల్గొన్నారు.