లక్ష్యo సాకారం దిశగా అడుగులు వేస్తే విజయం సాధించవచ్చు

గాయత్రి విద్యాసంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్

అట్టహాసంగా గాయత్రి కళాశాలల వీడ్కోలు మహోత్సవం
సిరా న్యూస్,పెద్దపల్లి;
లక్ష్యo సాకారం దిశగా అడుగులు వేస్తే విజయం సాధించవచ్చని గాయత్రి విద్యాసంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బందంపల్లి లో గల స్వరూప గార్డెన్ లో పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పిజి కళాశాల వీడ్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మరియు కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల పైనే దృష్టి పెట్టకుండా, ప్రైవేట్ రంగంలో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయి అన్నారు. ఈ పోటీని తట్టుకోవాలంటే విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. అందరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాన్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తే విజయం తప్పక వరిస్తుంది అన్నారు. డిగ్రీ విద్య పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తూ వారు భవిష్యత్ లో ఉన్నత శిఖరాలు చేరుకొని, మన విద్యాసంస్థకు, తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం ఇటీవల మరెడుగొండ గ్రామంలో నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ లో పాల్గొన్న 50 మంది వాలంటీర్లకు, శాతవాహన యూనివర్సిటీ నిర్వహించిన వికల్ప, ప్రేరణ మరియు ఆరోహణ -2024 కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన 53 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక అందరినీ ఉత్తేజితులను చేశాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జె. రవీందర్, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *