అధికారికంగా ప్రకటించిన బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
బద్వేలు అసెంబ్లీకి బొజ్జ రోషన్న జమ్మలమడుగు అసెంబ్లీకి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి
సిరా న్యూస్,బద్వేలు;
కడప జిల్లాలో బిజెపికి కేటాయించిన రెండు అసెంబ్లీ స్థానాలకు బుధవారం రాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధికారికంగా ప్రకటించారు. బద్వేలు అసెంబ్లీకి బొజ్జ రోశన్న జమ్మలమడుగు అసెంబ్లీకి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్లు ఆమె ప్రకటించారు. ముందు అనుకున్నట్లుగానే వీరిద్దరి పేర్లు అధికారికంగా ప్రకటించారు. బద్వేలు అసెంబ్లీ అభ్యర్థి బొజ్జ రెండు రోజుల క్రితమే టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఇప్పుడు ఆయనకి అసెంబ్లీ టికెట్ కేటాయించారు బద్వేలు అసెంబ్లీ టికెట్ బొజ్జకు ఇవ్వడంతో కూటమి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
========================