Rajesh:పెరిగిన కరువు భత్యం కోసం ఉద్యమించాలి

సిరా న్యూస్, ఖానాపూర్‌
పెరిగిన కరువు భత్యం కోసం ఉద్యమించాలి
* ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సునారికారి రాజేష్
* క‌ర‌ప‌త్రాల విడుద‌ల

బీడీ కార్మికుల పెరిగిన కరువు భత్యం అమలు చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సునారికారి రాజేష్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో బీర్ నంది గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సునారికారి రాజేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాల ఫలితంగా నేడు కరువు భ‌త్యం పెరిగింద‌న్నారు. కొత్త ముసాయిదాను తక్షణమే జీవో గా తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు గ్రామీణ పట్టణ ప్రాంతాల బీడీలు చుట్టే కార్మికులందరికీ ఒకే విధంగా వేత‌నాలు చెల్లించాలన్నారు. వెయ్యి బీడీలకు కనీసం వేతనం 114.60 పైసలు, బోనస్ 8.33 శాతం రూపాయలు 17.70 పై. జాతీయ సెలవులు సంవత్సరాలు సెలవులతో పాటు మొత్తం 1000 బీడీలకు కలుపుకొని 245. O8 పైసలు, బీడీ ప్యాకర్స్ కు 25 బీడీల కట్ట జిల్లి గల బీడీ 11 రూపాయల 30 పైసలు వీడిఏ, ఒక్కరోజు బీడీ ప్యాకింగ్ 65000 అదనంగా ఇవ్వాల‌న్నారు. ఈ ప్యాకింగ్ కు పెరిగిన వీడిఏ 17 రూపాయల 38 పైసలు, 25 బీడీల కట్ట జిల్ లేబుల్ గల బీడీ ప్యాకింగ్ పైసలు ఒక్కరోజు వీడి ప్యాకింగ్ 55000 అదనంగా ఈ ప్యాకింగ్ కు జరిగిన బిడిఏ 20 రూపాయల 55 పైసలు, మూడు బీడీల కట్ట జిల్లి లేబుల్ చీరి గల వీడి ప్యాకింగ్ 11 రూపాయల 30 పైసలు ఒక్కరోజు బీడీ ప్యాకింగ్ తో 42,000 ఆదనంగా ఈ ప్యాకింగ్ కు పెరిగిన వీడిఏ 28 రూపాయల 90 పైసలు పెరగడం జరిగింద‌న్నారు. పెరిగిన కరువు భత్యం ఏప్రిల్ నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు రోజుకు కనీసం 1000 బీడీల పని ఇవ్వాలని, నెలకు 26 రోజుల పని దినాలను కల్పించాలని తెలిపారు. ప్రింటెడ్ జిల్లి పని ఒక రోజుకు 55 వేల ప్యాకింగ్ కు రేటు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం లింగన్న బీడీ కార్మికులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *