సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను ఎవరు వాడకూడదు

-మంథని మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి

సిరా న్యూస్,మంథని;
మంథని పట్టణ ప్రజలు, వివిధ వ్యాపార యజమానులు 120 మైక్రాన్ ల కంటే తక్కువ మందము గల ప్లాస్టిక్ సంచులను, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను ఎవరు వాడకూడదని, వాడిన చో వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంథని మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి తెలిపారు.

గురువారం మంథని మున్సిపల్ పరిధిలో గల వివిధ వ్యాపార దుకాణాల పై సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై రైడ్ నిర్వహించగా ప్లాస్టిక్ వాడుతున్న టీఫిన్ సెంటర్, పండ్ల దుకాణాలు, చికెన్ సెంటర్ల కు గాను ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ (అమెండ్మెంట్) రూల్స్–2016 ద్వారా రూ.500 చొప్పున జరిమానా విధించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి మాట్లాడుతూ మంథని పట్టణములోని ప్రభుత్వ ఆదేశాను సారం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్(అమెండ్మెంట్) రూల్స్ – 2016 ననుసరించి 120 మైక్రాన్ ల కంటే తక్కువ మందము గల ప్లాస్టిక్ సంచులను, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకమును నిషేధించబడినదని అన్నారు. ఈ కార్యక్రమములో వార్డు ఆఫీసర్స్,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *