సిరా న్యూస్,తలమడుగు
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోండి
* చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేపట్టాలి
* జిల్లా పాలనాధికారి రాజర్షి షా
వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లో గురువారం కలెక్టర్ పర్యటించారు. ముందుగా తలమడుగు లోని జడ్పీహెచ్ ఎస్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిష్టర్ లను, హాజరు శాతాన్ని, మౌళిక సదుపాయాల ను ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఇప్పటివరకు 53 కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, గ్రామాల్లో నీటి సమస్యల గురించి (సిఎస్ )ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఆన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని వేసవి కాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో కలిసి పని చేస్తూ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ మున్సిపాలిటీ అధికారులు ప్రతి మండలంలోని గ్రామాలలోని హాబిటేషన్ లో నీటి సమస్యలు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని, లక్ష్మీ పూర్ లో ఏర్పాటు చేసిన ఇంటర్ స్టేట్ బోర్డ్ చెక్ పోస్ట్ లను పరిశీలించి, ప్రతీ వాహనాన్ని ఎక్సై జ్ అధికారులతో కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. చెక్ పోస్టు వద్ద నిర్వహిస్తున్న రిజిష్టర్ లను పరిశీలించి 50 వేల కంటే ఎక్కువ డబ్బులు సరయిన ఆధారాలు లేకుండా తీసుకెళితే ఎన్నికల కమిష న్ఆదేశాలననుసరించి సీజ్ చేయాలని అన్నారు. మిషన్ భగీరథ కు సంబందించి వాటర్ స్టోర్ ఉందా లేదా అధికారులను అడిగి తెలుసుకొని ఇంతకు ముందు మంజూరైన పనులను తొందరగా పూర్తి చేయాలని తెలిపారు. దీనితోపాటు సుంకిడిలోని సంప్ హౌస్ నిర్మాణం జరుగుతుందని ఈ సంపు హౌస్ పూర్తయిన తర్వాత మండలాలు భీంపూర్ తలమడుగు తాంసి గ్రామాలకు పంపింగ్ జరుగుతుందని , ఈ నిర్మాణం పనులకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.మన జిల్లాలో 6 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ చెక్ పోస్ట్ లో పోలీస్ రెవెన్యూ ఎక్సైజ్ తో పాటు కొన్ని చెక్ పోస్ట్ లలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా పని చేస్తుందని తెలిపారు. కొన్ని రోజులలో నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని ప్రజలకు విజ్ఞ ప్తి ఇంకా ఎవరైనా ఎలక్టోరల్ గా నమోదు చేయించకపోతే ఏప్రిల్ 14వ తేదీలోపు నమోదు చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్ ఓ రాజ్ మోహన్, ఎంపిడిఒ, పోలిస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నరు.