సిరా న్యూస్, బేల:
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి..
బేల ఎస్. ఐ. రాధిక..
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో గురువారం నాడు శివాజీ చౌక్ నుండి పోలీసు స్టేషన్ వరకు కేంద్ర బలగాలతో, పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ ఎస్ ఐ పురుషోత్తం, బేలా పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.