సిరాన్యూస్, భీమదేవరపల్లి
రాష్ట్రంలో జిల్లాలను తగ్గించాలి
* పార్లమెంట్ స్థానాల ప్రకారం జిల్లాలు చేయాలి
* కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పచ్చునూరు కరుణాకర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని గుప్పెట్లో తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా జిల్లాలుగా విభజించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పచ్చునూరు కరుణాకర్ అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కుమారునికో జిల్లా, తన అల్లుని కో జిల్లా, మంత్రులు ఎంతమంది ఉంటే అన్ని జిల్లాలుగా విభజించి రాష్ట్రాన్ని 33 ముక్కలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ స్పందించి ఇప్పటికైనా జిల్లాలు తగ్గించి రాష్ట్రంలో ఎన్ని పార్లమెంటు స్థానాలు ఉన్నాయో అన్ని జిల్లాలు మాత్రమే చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలు ఎన్ని ఉన్నాయో అన్ని జిల్లాలు మాత్రమే చేసుకున్నారని తెలిపారు. పార్లమెంటు స్థానాలు ప్రకారంగా జిల్లాలు చేసుకుంటే రాష్ట్రానికి ఖర్చు తగ్గుతుందని, అనేక మంది ఉద్యోగాలు తగ్గుతారని, 35 మండలాలు కలిపి ఒక జిల్లా గా ఏర్పాటు చేయాలని, జిల్లా లో రెండు ఆర్ డి వో ఆఫీస్ లో ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ప్రజల మనోభావాలను తెలుసుకొని 17 లేదా 20 జిల్లాలు మాత్రమే చేయాలని వారిని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాగంటి వెంకటేశ్వర్లు, ఎలుక పెళ్లి ఆనందం, లింగం కృష్ణ ,ఎలకపల్లి రాజేష్, రామారావు ,అనకొండ సదానందం, బొల్లంపల్లి కుమారస్వామి , చిట్టెంపల్లి రాజా, వీరు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.