సిరా న్యూస్,పెద్దపల్లి;
తెలంగాణా రాష్ట్రం లోని 80లక్షల మంది మాదిగల ఆత్మ గౌరవానికి సవాలుగా మారిన పెద్దపల్లి పార్లమెంటు సీటును గజ్జెల కాంతంకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాదిగశక్తి ఆద్వర్యంలో ఢిల్లీలోని ఏఐసిసి కాంగ్రెస్కార్యాలయం ముందు మాదిగలు బలప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగశక్తి వ్యవస్థాపక అద్యక్షుడు బొంకూరి సురేందర్ మాట్లాడుతూ మాదిగ లను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపైవివరించడం జరిగిందన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు కల్నల్ రోహిత్ చౌదరీని కలిసి రాష్ట్రంలో మాదిగ సామజికవర్గానికి రాజకీయంగా జరుగుతున్న అన్యాయంపై వివరించామన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ స్థానంలో మాదిగకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలుగా అతని కుటుంబానికి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడంజరిగిందని, వారి గెలుపుకు సైతం మాదిగలు తోడ్పడ్డారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికీ యావత్తు మాదిగలు అండగా నిలబడిన విషయాన్ని అధిష్టానం మరిచిపోయిందని ఆవేదనవ్యక్తం చేశారు. వెంటనే వంశీకృష్ణ పేరును మార్చి గజ్జెల కాంతానికి టికెట్ కేటాయించాలని కోరారు. ఈ ధర్నాలో మాదిగ జేఏసీ, మాదిగ రాజకీయ వేదిక, మాదిగ దండోరా సంఘాల నాయకులు కల్లేపళ్లి రవి, సతీష్,కిషోర్, పర్వతాలు, చంద్రు, సందీప్, నర్సయ్య, పవణ్ కళ్యాణ్, మొగిలి, భూమయ్య, రాజేందర్, సుందర్, కాంతయ్య, రాజేశ్వరి, సుజాత సిరిసిల్ల నర్సయ్య, శారద, రెండువందల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.