సిరా న్యూస్,రంగరెడ్డి;
శంషాబాద్ మండలంలో బీజేపీ ప్రజా ఆశీర్వాదం యాత్ర ప్రారంభం అయింది. యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే కటికపల్లి వెంకటరమణారెడ్డి, కొండ విశ్వేశ్వేరెడ్డి, సంగితారెడ్డి తదితరులు పాల్గోన్నారు. శంషాబాద్ మండలంనర్కుడ శివారులోని సితారామస్వామి అలయంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి మోడీ వేవ్ కొనసాగుతుందని వేవ్ ఎవరు ఆపలేరని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదంతో నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి అభ్యర్థులు కరివయ్యారని అన్నారు. ఇతర పార్టీల నుండి అరువు తెచ్చుకుని నిలబెట్టుకుంటున్నారని ఎద్దేవ చేశారు. శంషాబాద్ మండలంలో జీవో 111 పై పోరాటం చేశాననిప్రజల్లో ఉంటూ ప్రజాసేవకు అంకితమయ్యాలని తెలిపారు.
కామారెడ్డి శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అమ్మపల్లి సీతారామ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ప్రజా ఆశీర్వాద యాత్ర కాస్త విజయోత్స యాత్రగా మారుతుందని అన్నారు. ఒక పార్టీలో పార్లమెంట్స్థానానికి ఐదు సంవత్సరాలు ఉండి మరో పార్టీ నుండి పోటీ చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఎప్పుడు అందుబాటులో ఉంటాడని తెలిపారు. ఎన్నికలు ఉన్న లేకపోయినా ప్రజల మధ్యఉండే గుణవంతుడని కొండ విశ్వేశ్వర్ రెడ్డి గురించి నేను కాదు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు.
========================